telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జగన్ ఆస్తుల కేసు మరోసారి వాయిదా

jagan

ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆస్తుల కేసు విచారణను హైదరాబాద్‌లోని సీబీఐ, ఈడీ కోర్టు మరోసారి వాయిదా వేసింది. ప్రభుత్వ పరమైన కార్యక్రమాల వల్ల తాను కోర్టుకు హాజరుకాలేనంటూ జగన్‌ తన లాయర్ దాఖలు చేసిన ఆబ్సెంట్‌ పిటిషన్‌ను కోర్టు అనుమతించింది.

ఈ కేసులో సహనిందితులైన శ్రీలక్ష్మి, రాజగోపాల్‌లు కోర్టుకు హాజరయ్యారు. కేసు విచారణ చేపట్టిన న్యాయమూర్తి తదుపరి విచారణను ఈనెల 13కు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.

Related posts