టీడీపీ నేత కోడెల శివప్రసాద్ రావుపై ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజున సత్తెనపల్లి నియోజక వర్గంలోని ఇనిమెట్ల బూత్ లో ఘటన నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. కోడెల సహా మరో 22 మందిపై 8 సెక్షన్ల కింద రాజుపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు.
సెక్షన్ 188, 143, 341, 448, 506, ఆర్/ డబ్ల్యు 149, ఐపీసీ 131, 132 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమాచారం. ఆ బూత్ లో గంటన్నరపాటు కూర్చున్న కోడెల, ఓటర్లను ప్రభావితం చేసేందుకు యత్నించారని వైసీపీ నేతలు ఆరోపించారు.