telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

ఏపీ సీఎం చంద్రబాబు పై కేసు పెడతా: స్వరూపానందేంద్ర స్వామి

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అధికారులపైనా.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపైన కేసు పెడతానని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర హెచ్చరించారు. గుంటూరు జిల్లా  గోరంట్లలోని శ్రీపద్మావతి అండాళ్ సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి రిలీజియన్ సొసైటీ దేవస్థానంలో జరుగుతున్న సప్తదశ వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఆయన పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా  స్వరూపానందేంద్ర  మాట్లాడుతూ టీటీడీ లో పాలన లోపభూయిష్టంగా ఉందని,  ఆలయ భూములు అన్యాక్రాంతం అయ్యాయని ఆరోపించారు. 
టీటీడీ భూములకు  సంబంధించిన ఆధారాలు తమవద్ద ఉన్నాయని, వాటిని త్వరలోనే మీడియా ముందు ప్రవేశపెడతానని ఆయన వెల్లడించారు. సీఎంతో  పాటు సంబాధిత అధికారుల పై  కోర్టులో కేసు కూడా వేస్తానని ఆయన అన్నారు. ఏపీలో అవినీతి తారాస్థాయికి చేరిపోయిందని ఆరోపించారు. తెలంగాణలో కేసీఆర్ ముఖ్య మంత్రి అవ్వడానికి తానే కారణమన్నారు. తాను దగ్గర ఉండి మరీ కేసీఆర్ చేత రాజశ్యామల యాగం చేయించానని,  అందుకే సీఎం అయ్యారని అభిప్రాయపడ్డారు. ఏపీలో ప్రభుత్వం మారడం కోసం త్వరలో తాను మరో రాజశ్యామల యాగం చేస్తానని చెప్పారు.

Related posts