telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వర్మపై రాజోలులో కేసు నమోదు… క్షమాపణలు చెప్పాలని డిమాండ్

RGV

వివాదాస్పద సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై మంగళవారం తూర్పు గోదావరి జిల్లాలో కేసు నమోదైంది. జిల్లాలోని రాజోలు పోలీస్ స్టేషన్‌లో నాయీ బ్రాహ్మణ సంఘం నాయకులు ఫిర్యాదు చేశారు. ఓ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ గోపాల్ వర్మ.. నాయీ బ్రాహ్మణులను కించపరిచే విధంగా మాట్లాడారని వారు ఆరోపించారు. నాయీ బ్రాహ్మణుల నాయకుల ఫిర్యాదు మేరకు రాజోలు పోలీసులు వర్మపై కేసు నమోదు చేశారు. నాయీ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర కార్యవర్గం పిలుపు మేరకు రామ్ గోపాల్ వర్మ వర్మపై ఫిర్యాదు చేసినట్లు రాజోలు మండల నాయి బ్రాహ్మణ సంఘం నేతలు వెల్లడించారు. వెంటనే ఆయన్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పవర్ స్టార్ సినిమా విషయంలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు,ఆయనకు మధ్య తలెత్తిన వివాదంలో అనవసరంగా తమ కుల ప్రస్తావన తీసుకొచ్చారని మండిపడ్డారు. వర్మ తమకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Related posts