telugu navyamedia
సినిమా వార్తలు

కేసులో ఇరుక్కున్న అమీషా పటేల్… అరెస్ట్ తప్పదా ?

amisha patel latest bold photo shoot

బద్రి, నాని వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్. ప్రస్తుతం ఫోటోషూట్లతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఇబ్బందుల్లో చిక్కుకుంది. బాలీవుడ్ లో కహోనా ప్యార్ హై వంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించిన అమీషా పటేల్ ఆ తర్వాత నిర్మాతగా మారింది. “దేశీ మ్యూజిక్” పేరుతో ఓ సినిమాను నిర్మించింది. 2013లో ప్రారంభమైన ఈ సినిమా కొన్ని కారణాలతో మధ్యలోనే ఆగిపోయింది. అయితే ఈ సినిమా కోసం అజయ్ కుమార్ సింగ్ అనే ఫైనాన్షియర్ నుంచి రూ.3 కోట్ల అప్పు తీసుకుంది. ఈ క్రమంలో అమీషా పటేల్ అప్పు చెల్లించకపోవడంతో అజయ్ కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో అమీషా పటేల్ ఇచ్చిన చెక్ కూడా బౌన్స్ అయింది. దీంతో ఈ నెల 8న విచారణకు స్వయంగా హాజరుకావాలని ముంబైలోని ఓ కోర్టు ఆమెకు నోటీసులు జారీ చేసింది. ఒకవేళ ఆమె విచారణకు హాజరు కాకుంటే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని హెచ్చరించింది కోర్టు. ఈ విషయంపై స్పష్టత కోరిన ప్రతీసారి అమీషా తప్పించుకొని తిరుగుతుందని అజయ్ కుమార్ ఆరోపిస్తున్నారు.

Related posts