telugu navyamedia
సినిమా వార్తలు

నటుడు ఆహుతి ప్రసాద్ కొడుకుపై కేసు

Karthik-Prasad

దివంగత నటుడు ఆహుతి ప్రసాద్ అంటే తెలియని ప్రేక్షకులు ఉండరు టాలీవుడ్ లో. ఎన్నో చిత్రాల్లో తనదైన శైలిలో కోనసీమ యాసలో డైలాగులు చెప్పి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు ఆయన. తాజాగా ఆహుతి ప్రసాద్ తనయుడు కార్తీక్ ప్రసాద్ పై బంజారాహిల్స్ పోలీస్టేషన్ లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే… ఇటీవల కార్తీక్ ప్రసాద్ బంజారాహిల్స్ రోడ్ నెం 2లో సినిమా చూసేందుకు పీవీఆర్ సినిమాస్ కు వెళ్లారు. షో ప్రారంభమయ్యే ముందు జాతీయ గీతం వస్తుంది. జాతీయ గీతం వస్తున్న సమయంలో కార్తీక్ ప్రసాద్ లేచి నిలబడలేదట. అతడి పక్కనే ఉన్న వ్యక్తి జాతీయ గీతం వస్తోంది కదా.. లేచి నిలబడండి అని కోరాడట. తనని ప్రశ్నించాడనే కోపంతో కార్తీక్ ప్రసాద్ ఆ వ్యక్తిని బూతు పదజాలంతో దూషించినట్లు తెలుస్తోంది. ఇలా అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసిన కార్తీక్ ప్రసాద్ పై సదరు వ్యక్తి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. సినిమా థియేటర్స్ లో జాతీయ గీతం ప్లే చేయాలనే నిబంధనని ప్రభుత్వం తీసుకువచ్చాక దీనిపై సర్వత్రా చర్చ జరిగింది.

Related posts