లోక్సభ ఎన్నికల్లో ఉత్తర్ప్రదేశ్లోని రాంపూర్ నుంచి బీజేపీ తరపున బరిలో దిగిన నటి జయప్రదపై ప్రత్యర్థి సమాజ్వాదీ పార్టీ నాయకుడు ఆజంఖాన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆమె లోదుస్తులు ఫలాన రంగులో ఉన్నాయంటూ ఆదివారం ఎన్నికల సభలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఆజంఖాన్పై ఉత్తర్ప్రదేశ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఆయనకు త్వరలోనే నోటీసులు పంపనున్నామని జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్శ ఇప్పటికే తెలిపారు. ఐతే తాను బీజేపీ అభ్యర్థి జయప్రదను ఉద్దేశించి ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదని సోమవారం ఆజంఖాన్ వివరణ ఇచ్చారు. ఎస్పీ తరఫున జయప్రద గతంలో పదేళ్లపాటు రాంపూర్కు ప్రాతినిధ్యం వహించారు. ఇటీవల బీజేపీలో చేరిన ఆమె అదే స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు.
ఫామ్ హౌస్, ప్రగతి భవన్, పబ్లిక్ మీటింగ్లకే..కేసీఆర్ పై పొన్నాల విమర్శలు