telugu navyamedia
సినిమా వార్తలు

ఉప్పల్ స్టేడియంలో తప్పతాగి యాంకర్ రచ్చ

Anchor-Prashanthi

ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌- కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగింది. ఈ మ్యాచ్ తిలకించేందుకు వెళ్లిన యాంకర్ ప్రశాంతిపై పోలీస్ కేసు నమోదైంది. అసలేం జరిగిందంటే… తన స్నేహితులు పూర్ణిమ, ప్రియ, శ్రీకాంత్ రెడ్డి, సురేష్, వేణుగోపాల్‌లతో కలిసి తప్పతాగిన యాంకర్ ప్రశాంతి మ్యాచ్ చూసేందుకు ఉప్పల్ స్టేడియంకు వెళ్లింది. అయితే అక్కడ వీళ్ళు తోటి వీక్షకులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. మ్యాచ్ చూడకుండా సంతోష్ ఉపాధ్యాయ్ అనే వ్యక్తితో ప్రశాంతి అసభ్యంగా ప్రవర్తించింది. దీంతో ఆగ్రహానికి లోనైన ఓ వీక్షకుడు ప్రశాంతితో పాటు ఆమె స్నేహితులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసు అధికారులు ప్రశాంతిపై కేసు నమోదు చేశారు. మరికాసేపట్లో ఆమె పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వివరణ ఇవ్వనున్నట్టు సమాచారం.

Related posts