telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

వైసీపీ ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్..

ycp ap

ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి ఎంత మాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతూనే వున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో 8 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో 2,237 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8 లక్షల 42 వేల 967 కి చేరింది. అయితే ఈ వైరస్ ఎవరిని వదలడం లేదు. తాజాగా.. వైసీపీ కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వర్ రావు కరోనా బారిన పడ్డారు. గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం సరిగా లేకపోవడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ మధ్య తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. 

Related posts