అతివేగంతో అదుపుతప్పిన కారు పంటకాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లా కొత్తపల్లి బ్రిడ్జి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. సింహాచలం ఆలయానికి వెళ్లి దైవదర్శనం చేసుకుని ఒడిశాలోని బరంపురం వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది.
కారు మందస మండలంలోకి రాగానే కొత్తపల్లి బ్రిడ్జి వద్ద అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న కాల్వలోకి దూసుకెళ్లింది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ఐదుగురు మరణించగా, మరో ఇద్దరు గల్లంతయ్యారు. కారు డ్రైవర్ కు తీవ్రగాయాలు కావడంతో అతడిని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.