తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మృతికి సంతాపసూచకంగా కొవ్వొత్తుల ర్యాలీలు చేపట్టారు. జిల్లా కేంద్రాలు, ఆర్టీసీ డిపోలు, అమరవీరుల స్తూపాల వద్ద ఆర్టీసీ కార్మికులు, ప్రజా సంఘాల నేతలు కొవ్వొత్తులతో ర్యాలీలు నిర్వహించారు. ఆర్టీసీ సమ్మె పరిణామాల నేపథ్యంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్లోని అపోలో డీఆర్డీవో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మృతి చెందిన విషయం తెలిసిందే.
ఖమ్మంలోని శ్రీనివాస్ రెడ్డి నివాసానికి ఆయన మృతదేహాన్ని తరలించారు. కాంగ్రెస్ నేతలు భట్టి విక్రమార్క, వి.హనుమంతరావు, మాజీ ఎంపీ జితేందర్రెడ్డి తదితరులు శ్రీనివాస్రెడ్డి, సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ నేతలు శ్రీనివాస్రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించారు.