telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైఎస్సార్ చేనేత నేస్తం పేరుతో ఏటా రూ.24 వేలు: పేర్ని నాని

perni nani minister

వైఎస్సార్ చేనేత నేస్తం పేరుతో ఏటా రూ.24 వేలు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని ఏపీ మంత్రి పేర్ని నాని అన్నారు. కేబినెట్ సమావేశం అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైఎస్సార్ చేనేత నేస్తం కింద ఒకేసారి రూ.24 వేలు సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించందన్నారు. అందరికీ సురక్షితమైన మంచినీరు ఇచ్చేందుకు వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు.

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో బోర్లు వేసేందుకు రిగ్స్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు కార్పొరేషన్ల ద్వారా వాహనాలు కొనేందుకు ఋణ సౌకర్యం కల్పించనున్నట్టు పేర్కొన్నారు. హోంగార్డులకు ఇచ్చే రోజువారీ జీతభత్యం రూ.710కు, మధ్యాహ్న భోజన కార్మికుల గౌరవ వేతనం రూ.3 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. మత్స్యకార కుటుంబాలకు ఇచ్చే ఆర్థికసాయం పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు.

Related posts