telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఎంఐఎం ర్యాలీకి షరతులతో కూడిన అనుమతి

asaduddin owisi

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ఎంఐఎం నిర్వహించనున్న ర్యాలీకి షరతులతో కూడిన అనుమతి లభించింది. సీఏఏని మొదటినుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఎంఐఎం తాజాగా హైదరాబాదులో భారీ ర్యాలీకి సన్నద్ధమవుతోంది. సీఏఏతో పాటు ఎన్నార్సీ, ఎన్పీఆర్ లను నిరసిస్తూ శనివారం నిర్వహించనున్న ఈ ర్యాలీకి పోలీసులు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేశారు.

ర్యాలీ అనంతరం జరిగే సభా వేదికను చార్మినార్ నుంచి ఖిల్వత్ గ్రౌండ్స్ కు మార్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాల అనంతరం అర్ధరాత్రి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ ర్యాలీకి భారీ సంఖ్యలో ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు.

Related posts