telugu navyamedia
రాజకీయ వార్తలు

కాంగ్రెస్‌ ముస్లింలను గందరగోళానికి గురిచేస్తోంది: యడియూరప్ప

BS Yeddyurappa bjp

పౌరసత్వ సవరణ చట్టంవల్ల ఏ ఒక్క ముస్లింకు నష్టం వాటిల్లదని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప అన్నారు. బెంగళూరులో గడపగడపకు వెళ్లి, ప్రజలతో సమావేశమై సీఏఏ పై వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ముస్లింలను గందరగోళానికి గురి చేస్తోందన్నారు.

సీఏఏ వల్ల ఏ ఒక్క ముస్లింకు కూడా అన్యాయం జరగదనీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏం చేసినా అన్ని వర్గాలకు న్యాయం చేస్తుందనీ తేలిపారు. ఇప్పటికే ఎన్నో విజయవంతమైన కార్యక్రమాలు చేపట్టిందని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్‌.. ఎక్కడ తన ఉనికిని కోల్పోతుందోనని ఇలాంటి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందని దుయ్యబాట్టారు.

Related posts