బీజేపీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ ఇరు తెలుగు రాష్ట్రాల్లో జోరుగా కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు నేతలు కాషాయ కండువా కప్పుకున్నారు. తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్, ఒంగోలు డెయిరీ మాజీ ఛైర్మన్ శిద్దా వెంకటేశ్వరరావు బీజేపీలో చేరారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఆధ్వర్యంలో హైదరాబాదులో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. శిద్దాను అమిత్ షా సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ విషయమై శిద్దా వెంకటేశ్వరరావు స్పందింస్తూ, పార్టీ నిర్ణయాలకు కట్టుబడి, హైకమాండ్ ఆదేశాలకు అనుగుణంగా పని చేస్తానని తెలిపారు. మరోవైపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కూడా బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.