telugu navyamedia
ట్రెండింగ్

గుండెపోటుతో బస్సు డ్రైవర్.. ప్రయాణికులను కాపాడి.. మృతి..

bus driver died with heart attack on duty

ఒత్తిడితో కూడుకున్న జీవితాలలో డ్రైవర్ ఉద్యోగం ఒకటి, సరైన జాగర్తలు తీసుకోకపోతే ఆరోగ్య సమస్యలు తప్పవు. ఇక గుండెపోటు లాంటివి ఎప్పుడు దాడి చేస్తాయో చెప్పడం అసాధ్యం. తాజాగా, ఒక డ్రైవర్ కు అదే పరిస్థితి వచ్చింది. విధినిర్వహణలో ఉండగా, గుండెపోటు రావటంతో, ప్రయాణికులను సురక్షితంగా ఉంచాలని తపనపడి, వారి ప్రాణాలు సేఫ్ అనుకున్నాక మృత్యువు ఒడిలోకి చేరుకున్నాడు. వివరాల్లోకి వెళితే..తిరువళ్లూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్ బస్సులో విధుల్లో ఉన్నాడు ఆ డ్రైవర్. బస్సులో 50 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. బస్సు నడుపుతున్న సమయంలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో రమేశ్ విలవిల్లాడిపోయాడు. గుండెపోటుతో మరికొన్ని క్షణాల్లో తన ప్రాణాలు తీయబోతోందని తెలిసినా..ప్రయాణికుల ప్రాణాలు కాపాడేందుకు ఎంతో తాపత్రయపడ్డాడు.

తన ప్రాణాలు పోవడం ఖాయమన్న నిర్ధారణకు వచ్చిన రమేశ్ క్షణాల్లోనే బస్సును రోడ్డు పక్కకి తీసుకెళ్లి బ్రేక్ వేసి, అలానే కుప్పకూలిపోయాడు. ఉన్నట్టుండి రోడ్డు పక్కకు బస్సు మళ్లడంతో ప్రయాణీకులు ఆశ్చర్యానికి గురయ్యారు. డ్రైవర్ పరిస్థితి చూసి బస్ కండక్టర్ వెంటనే తేరుకుని 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అనంతరం చెన్నైలోని కీల్‌పాక్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. రమేశ్‌ను పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మృతి చెందినట్టు నిర్ధారించారు. తమ ప్రాణాలు కాపాడేందుకు డ్రైవర్ చేసిన సాహసం గురించి తెలిసి ప్రయాణికులు కంటతడి పెట్టుకున్నారు.

Related posts