ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రకాశం జిల్లాలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 18 మందికి గాయాలు కాగా, ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.
తిరుపతి నుంచి శ్రీశైలం వెళ్తుండగా మార్కాపురం మండలంలోని కోమటికుంటలో బస్సు అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. బాధితుల్లో హైదరాబాద్, కూకట్ పల్లి వాసులు ఉన్నట్టు సమాచారం. బస్సును అధిక వేగంతో నడపడం వల్లే ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.