telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ప్రధాని రక్షణకు .. బడ్జెట్ పెంపు…

modi on brics meet in

తాజా కేంద్ర బడ్జెట్‌లో ప్రధానమంత్రి రక్షణ కోసం ఉండే ప్రత్యేక రక్షణ బృందాని(ఎస్పీజీ)కి కేటాయించాల్సిన నిధులను మరింత పెంచారు. గతేడాది బడ్జెట్లో ఇందుకోసం రూ.540 కోట్లు కేటాయించగా.. ఈ సారి రూ.60కోట్లు పెంచి మొత్తం రూ.600కోట్లు కేటాయించారు. అంతకు ముందు ఏడాది రూ.420 కోట్లు ఉండగా దాన్ని గతేడాది బడ్జెట్‌లో రూ.540 కోట్లకు పెంచిన విషయం తెలిసిందే. భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రస్తుతం దేశంలోనే అత్యధికంగా 3వేల మంది ప్రత్యేక భద్రతా సిబ్బందితో రక్షణ పొందుతున్నారు.

గతేడాది నవంబర్‌లో సోనియా గాంధీ కుటుంబసభ్యులకు ఎస్పీజీ భద్రతను ఉపసంహరించిన విషయం తెలిసిందే. ఎస్పీజీ భద్రతను అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ మరణానంతరం ప్రధానుల రక్షణ కోసం 1985లో ఏర్పాటు చేశారు. అనంతరం 1991లో రాజీవ్‌గాంధీ హత్యతో ఎస్పీజీ భద్రత ప్రధానుల కుటుంబానికి సైతం వర్తించేలా మార్పులు చేశారు.

Related posts