సాధారణ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో అన్ని పార్టీలు వారివారి బలాబలాలతో పోటీకి సిద్ధమవుతున్నాయి… తమకు బలమున్న స్థానాల్లో పోటీ చేస్తూనే, ఇతర స్థానాల్లో కుదిరితే పొత్తులతో బరిలోకి దిగేలా ప్రణాళికలు రచిస్తున్నాయి. అయితే కర్ణాటకలో పొత్తులు కుదరకపోతే 28 స్థానాల్లోనూ పోటీ చేస్తామని బహుజన్ సమాజ్ పార్టీ కర్ణాటక ఎమ్మెల్యే, రాష్ట్ర మాజీ మంత్రి ఎన్.మహేష్ తెలిపారు.
అయితే కర్ణాటకలో ఏ పార్టీతో అయినా పొత్తు పెట్టుకుంటే మాకు కేటాయించే స్థానాల్లో మేం పోటీ చేస్తాం.. లేదంటే, అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందన్న ఆయన.. సీట్ల కేటాయింపుపై తుది నిర్ణయం ఫిబ్రవరి 2వ తేదీన జరిగే బీఎస్పీ రాష్ట్ర కమిటీ భేటీలో తీసుకుంటామని వెల్లడించారు.