ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, బీఎస్పీ అధినేత్రి మాయావతి సోదరుడికి చెందిన సుమారు 400 కోట్ల విలువైన బినామీ కమర్షియల్ ప్లాట్ను ఆదాయపన్నుశాఖ అధికారులుజప్తు చేశారు. ఇటీల ఆనంద్ సింగ్ ను బీఎస్పీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ మాయవతి నిర్ణయం తీసుకున్నారు. ఉపాధ్యక్షుడిగా నియమించిన కొద్దిరోజులకే ఆనంద్ సింగ్ పేరుపై యూపీలోని నొయిడాలో ఉన్న ఈ బినామీ ఆస్తిని ఐటీ శాఖలోని బినామీ ప్రొహిబిషన్ యూనిట్(బీపీయూ) జప్తుచేసింది.
మాయావతి సోదరుడు ఆనంద్కుమార్తో పాటు ఆయన భార్య లతకు నోటీసులు జారీ చేసింది. ఆ బినామీ ప్లాట్లో అయిదు అంతస్తుల హోటల్ను నిర్మించాలనుకున్నారు. ఐటీ అధికారులు జప్తు చేసిన భూమి 28,328.07 చదరపు మీటర్లు ఉందనీ, ఈ ఆస్తి పుస్తక విలువే రూ.400 కోట్ల మేరకు ఉంటుందని సమాచారం.