బీఎస్ఎన్ఎల్ మరోసారి గ్రేస్ పీరియడ్లో ఉన్నవారి కోసం, రద్దయిన వినియోగదారుల కోసం అదనపు టాక్టైం ఆఫర్లు ద్వారా రెండు ప్రత్యేక ఓచర్లను ప్రవేశపెట్టినట్టు జనరల్ మేనేజర్ కేఎస్.వరప్రసాద్ తెలిపారు. రూ.150 టాప్అప్పై 90 రోజుల వ్యాలిడిటీతో రూ.180 టాక్టైంను ఇస్తున్నామన్నారు. రూ.151 ప్లాన్ ద్వారా 28 రోజుల పాటు దేశవ్యాప్తంగా అన్ని నెట్వర్కులకు అపరిమిత ఫ్రీకాలింగ్ ఇస్తున్నామన్నారు. రోజుకు 3.2 జీబీ హైస్పీడ్ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్లు ఇస్తున్నామన్నారు. రూ.298 ఓచర్ ద్వారా, ప్లాన్ రూ.328కు మారిన వారికి 90 రోజుల పాటు దేశవ్యాప్తంగా అన్ని నెట్వర్క్లకు అపరిమిత కాల్స్ ఇస్తున్నామన్నారు. 300 ఎస్ఎంఎస్లు ఉచితంగా ఇస్తామన్నారు. 180 రోజుల ప్లాన్ వ్యాలిడిటీని కూడా పొందవచ్చన్నారు. ఇతర వివరాలకు సమీప కస్టమర్ సర్వీస్ సెంటర్లో సంప్రదించాలన్నారు.
ఈ నెల 17వ తేదీ నుంచి 29వ తేదీ వరకు బీఎస్ఎన్ఎల్ జిల్లా వ్యాప్తంగా ఫ్రీసిమ్ మెగా మేళాను నిర్వహించనున్నట్టు జీఎం వరప్రసాద్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న బీఎస్ఎన్ ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్లోను, బీఎస్ఎన్ఎల్ ఫ్రాంచైజీల వద్ద, డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్ల వద్ద 64కే, 128కే, నార్మల్, మైక్రో, స్మార్ట్ సిమ్లను ఉచితంగా పొందవచ్చన్నారు. నెంబర్ పోర్ట బులిటీ వినియోగదారులకు కూడా ఫ్రీసిమ్ ఇస్తామన్నారు.