మెట్రో పనుల కోసం మహారాష్ట్రలోని పుణె సిటీలో తొవ్వకాలు జరుగుతున్నాయి. అయితే స్వరగేట్ ప్రాంతంలో తొవ్వకం జరుగుతున్న సమయంలో అక్కడ బ్రిటీష్ కాలం నాటి టన్నెల్ బయటపడింది. ఆ టన్నెల్ సుమారు 57 మీటర్ల పొడువు ఉన్నట్లు స్థానిక చరిత్రకారుడు మందర్ లవాటే తెలిపారు.
సుమారు 90 ఏళ్ల క్రితం ఈ టన్నెల్ను నీటి సరఫరా కోసం వినియోగించి ఉంటారని అతను తెలిపాడు. దాదాపు 15 ఫీట్ల లోతులో టన్నెల్ ఉన్నట్లు గుర్తించారు. ఆ టన్నెల్ 1.4 మీటర్ల వెడల్పు, 3.5 మీట్ల ఎత్తు ఉంది. స్వరగేట్ వద్ద ఉన్న నీటి కొలనకు ఆ టన్నెల్తో లింకు ఉన్నట్లు గుర్తించారు.
“టీచర్స్ డే”ని విస్కీతో ముడిపెడుతూ… ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు