telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

మరికొన్ని రోజులు క్వారంటైన్ లోనే బ్రిటన్ ప్రధాని… ఇంకా తగ్గని కరోనా లక్షణాలు

Britan-PM

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. బ్రిటన్‌లో ఇప్పటి వరకూ 49,000 మంది వైరస్ బారినపడగా… 4,900 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. పది రోజుల కిందట బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు కరోనా వైరస్ నిర్దారణ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలడంతో ఆయన స్వీయ నిర్బంధంలో ఉండి చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే, బోరిస్ జాన్సన్‌ను చికిత్స కోసం హాస్పిటల్‌కు ఆదివారం తరలించారు. గత పది రోజులుగా ప్రధాని స్వీయ నిర్బంధంలో ఉండి చికిత్స పొందుతున్నా… ఇంకా వైరస్‌ లక్షణాలు ఉన్నాయని అందుకే ఆసుపత్రికి తీసుకెళ్లామని ఓ అధికార ప్రతినిధి వెల్లడించారు. కోవిడ్-19 నిర్ధారణ అయినప్పటి నుంచి ప్రధాని బోరిస్ జాన్సన్ క్వారంటైన్‌లోనే ఉన్నారు. ఏడు రోజుల తర్వాత బయటకు రావొచ్చని వైద్యులు సూచించినప్పటికీ ఆయనలో ఇంకా వైరస్‌ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో నిర్బంధాన్ని మరికొన్ని రోజులు పొడగించుకున్నట్లు ప్రధానే స్వయంగా వీడియో సందేశం ద్వారా రెండు రోజుల కిందట తెలిపారు. ‘నా ఆరోగ్యం ఇప్పుడు మెరుగ్గానే ఉంది. ఏడు రోజుల క్వారంటైన్ కూడా పూర్తయింది. అయినా, ఇంకా స్వల్పంగా వైరస్‌ లక్షణాలు ఉన్నాయి. శరీర ఉష్ణోగ్రత కూడా ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లక్షణాలు పూర్తిగా తొలగిపోయేంత కాలం నేను స్వీయ నిర్బంధంలో ఉంటాను’ అని జాన్సన్‌ తెలిపారు. మరోవైపు, కరోనా మహమ్మారిని ఐక్యతగా ఎదుర్కొంటే పోరాటంలో విజయం సాధిస్తామని బ్రిటన్ రాణి ఎలిజిబెత్ 2 పిలుపునిచ్చారు. వైరస్ మరింత సవాల్‌గా మారుతోందని.. దేశ ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.. కొంతమందికి దుఃఖాన్ని మిగిల్చి, ఆర్థిక ఇబ్బందులు తీసుకొచ్చింది. రోజువారీ జీవితంలో అపారమైన మార్పులకు కారణమైందని ఆవేదన వ్యక్తం చేశారు.

Related posts