ప్రముఖ తెలుగు కమెడియన్ కన్నెగంటి బ్రహ్మానందానికి ఆదివారం గుండెపోటు వచ్చింది. ముంబైలోని ఆసియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ లో ఆయనకు బైపాస్ సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఆయన కుమారుడు, నటుడు రాజా గౌతమ్ స్పందించాడు. ప్రస్తుతం బ్రహ్మానందం ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు.
కొన్ని నెలలుగా అనారోగ్యంగా ఉన్న నాన్నగారిని హైదరాబాద్ లో డాక్టర్ కి చూపించామని, ఆయన సలహామేరకే దేశంలో ఉత్తమమైన ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ లో సోమవారం నాడు గుండె ఆపరేషన్ జరిగిందని స్పష్టం చేశారు. “నాన్నగారికి శస్త్ర చికిత్స జరిగిందని తెలిసి అభిమానులు, స్నేహితులు, సినీ ప్రముఖులు అందరూ ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేస్తున్నారు.
అందరి ప్రేమాభిమానాల కారణంగా ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంది” అని గౌతం తెలిపారు. ప్రస్తుతం బ్రహ్మానందం ఇద్దరు కుమారులు గౌతం, సిద్ధార్థ్ లు ముంబైలోనే ఉన్నారు