ఏపీ, తెలంగాణ ర్రాష్ట్రాల్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అర్హత పరీక్షను నిర్వహించనున్నారు. 2019-20 విద్యా సంవత్సరానికి వివిధ డిగ్రీ కోర్సుల్లో(బీఏ, బీకాం, బీఎస్సీ) ప్రవేశానికి ఆగస్టు 4న అర్హత పరీక్షను నిర్వహిస్తున్నట్లు డా.బీఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కౌన్సిలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు దునుకు వేలాద్రి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీ, తెలంగాణ ర్రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన 27 కేంద్రాల్లో(రీజినల్ సెంటర్స్) అర్హత పరీక్ష జరుగుతుందన్నారు. దీనికి ఎలాంటి విద్యార్హత లేకపోయినా 2019 జూలై నాటికి 18 ఏండ్లు నిండిన వారు అర్హులన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు టీఎస్, ఏపీ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 9959850497, 9000729590 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.
సీమ ప్రజలకు తాగునీరు ఇవ్వండి.. సీఎం జగన్ కు లోకేశ్ సూచన!