telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

అఖిల ప్రియకి బిగిసిన ఉచ్చు..ఆధారాలు అన్నీ వెల్లడించిన పోలీసులు !

బోయిన్‌పల్లిలో కిడ్నాప్‌ కేసులో అసలు సూత్రధారి అఖిలప్రియేనని సీపీ అంజనీకుమార్‌ పేర్కొన్నారు. కిడ్నాప్‌ కేసును ఛేదించి ఆధారాలను సీపీ అంజనీకుమార్‌ మీడియాకు వివరించారు. అఖిలప్రియే కిడ్నాప్‌ సూత్రధారి అని.. ఫేక్‌ నెంబర్‌ ప్లేట్‌లతో ఘటనా స్థలానికి నిందితులు వెళ్లారని తెలిపారు. నిందితుల సెల్‌ఫోన్లు, కార్లను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు. కిడ్నాప్‌కి పాల్పడిన నిందితులు మియాపూర్‌లోని సెల్‌ఫోన్‌ షాపులో సిమ్‌ కార్డులు కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ఈ కిడ్నాప్‌ కేసులో అఖిలప్రియ రిమాండ్‌ ఖైదీగా ఉన్నారన్నారు. ఈ కేసులో నిందితులు 6 సిమ్‌ కార్డులు వాడినట్లు వివరించారు. నిందితులు మళ్లీఖార్జున్‌రెడ్డి, మాదాల శ్రీను పేర్లతో సిమ్‌కార్డులు ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పుకొచ్చారు. ఈ సిమ్‌ నంబర్‌ను అఖిలప్రియ కూడా ఉపయోగించారని స్పష్టం చేశారు. అఖిలప్రియ అనుచరుడు సంపత్‌ కూమార్‌ను అరెస్ట్‌ చేసినట్లు చెప్పారు. కిడ్నాప్‌ కి ముందు నిందితులు రెక్కీ నిర్వహించారని మీడియాకు వివరించారు. ఈ కేసులో అఖిలప్రియ ప్రమేయం ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని సీపీ అంజనీకుమార్ పేర్కొన్నారు.

Related posts