మాజీ సీఎం చంద్రబాబు వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేసిన శ్రీనివాస్ పై ఐటీ దాడులు జరిగాయని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. మొత్తం 40 చోట్ల సోదాలు జరిపినట్టు ఐటీ శాఖ వెల్లడించిందని తెలిపారు. శ్రీనివాస్ ప్రైవేటు సెక్రటరీగా పనిచేసిన కాలంలో రూ.2 వేల కోట్ల వరకు లావాదేవీలు జరిగాయని చెప్పారు.
పేదలకు కట్టిన ఇళ్లలో కూడా భారీగా దోచుకున్నారని బొత్స మండిపడ్డారు. శ్రీనివాస్ తాను జరిపిన లావాదేవీలకు సంబంధించి పన్నులు ఎగ్గొట్టారని పేర్కొన్నారు. మూడు కంపెనీల్లో శ్రీనివాస్ ప్రమేయం ఉన్నట్టు కనిపిస్తోందని అన్నారు.
జగన్ పై డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు…