telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

లోకేశ్ నేరుగా మాట్లాడలేరు… ట్విట్టర్లో ఏదో ఒకటి చెబుతారు: బొత్స

టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. లోకేశ్ నేరుగా మాట్లాడలేరని… ట్విట్టర్లో ఏదో ఒకటి చెబుతారని ఆయన అన్నారు. అమరావతి స్టార్టప్ ఏరియాపై గతంలో సింగపూర్ సంస్థలతో చర్చించామని చెప్పారు.

ప్రాజెక్ట్ వల్ల కలిగే ప్రయోజనాలను వారు సరిగా చెప్పలేకపోయారని తెలిపారు. ఆ తర్వాత ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్టు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ప్రకటించారని చెప్పారు. రాష్ట్రం నుంచి పెట్టుబడులు వెళ్లిపోతున్నాయంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న చంద్రబాబు, లోకేశ్ వైఖరిని తప్పుబడుతున్నామని మంత్రి బొత్స అన్నారు.

Related posts