telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

అమరావతికి మూడు వేల కోట్ల బ్యాంకు గ్యారెంటీ : బొత్స

botsa ycp

మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ… అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయటం కోసం మూడు వేల కోట్ల బ్యాంకు గ్యారెంటీ కూడా ఇవ్వటానికి ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. కరకట్ట పై ఉన్న ఇల్లు చంద్రబాబు సొంతదో, అద్దెదో తెలియదన్న ఆయన ప్రాధాన్యత వారీగా అమరావతి ప్రాంతంలో రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. ఐదేళ్లలో ఎందుకు చంద్రబాబు కరకట్ట రోడ్డు వేయలేకపోయారు? అని ప్రశ్నించిన ఆయన ప్రభుత్వం ప్రణాళికబద్దంగా పనులు చేస్తుంది… ఎవరి ప్రాపకం కోసమో నిర్ణయాలు తీసుకోదని అన్నారు. టీడీపీ పార్టీ ఇప్పటికే మట్టికొట్టుకు పోయిందన్న ఆయన కుప్పం పర్యటనలో చంద్రబాబు మా పార్టీ పట్ల ఆక్రోశం వ్యక్తం చేశారు, పులివెందుల గురించి చంద్రబాబుకు ఎందుకు..? కుప్పం గురించి పట్టించుకోవడం మానేసి ఈ ప్రగల్భాలు ఎందుకు? అని ప్రశ్నించారు. కుప్పంను ఇన్నేళ్లలో ఎందుకు మున్సిపాలిటీ చేయలేకపోయారు? అని ప్రశ్నించిన ఆయన చంద్రబాబు చేసిన ఆకృత్యాలు వల్ల ప్రజలు ఏహ్య భావంతో ఉన్నారని అన్నారు. చంద్రబాబు కుప్పానికి, లోకేష్ మంగళగిరికి పరిమితం అయ్యారంటేనే వీరి రాజకీయ స్థాయి అర్థం అవుతుందని అన్నారు.

Related posts