భారత ఆటగాడు రోహన్ బోపన్న-డెనిస్ షపోవలోవ్ (కెనడా) జట్టు రోజర్స్ కప్ ఏటీపీ మాస్టర్స్ సిరీస్-1000 టెన్నిస్ టోర్నమెంట్లో సంచలన విజయంతో శుభారంభం చేసింది. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో అన్సీడెడ్ బోపన్న-షపోవలోవ్ ద్వయం 4-6, 6-1, 10-6తో ‘సూపర్ టైబ్రేక్’లో నాలుగో సీడ్ నికోలస్ మహుట్-రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్) జంటను ఓడించింది. 63 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో బోపన్న ద్వయం తొమ్మిది ఏస్లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్లు చేసింది.
బాసిలాష్విలి (జార్జియా)- స్ట్రఫ్ (జర్మనీ), ఎడ్మండ్ (బ్రిటన్)-టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) జోడీల మధ్య జరిగే తొలి రౌండ్ మ్యాచ్ విజేతతో ప్రిక్వార్టర్ ఫైనల్లో బోపన్న జంట తలపడుతుంది.
ఈసీని కలిస్తే మోదీ ఎందుకు ఉలిక్కిపడుతున్నారు: చంద్రబాబు