telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

హైదరాబాదును ప్రపంచ పటంలో పెట్టింది చంద్రబాబే: బోండా ఉమ

tdp bonda uma counter on ycp comments

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం టీడీపీ అధినేత చంద్రబాబు ఎంతో కృషి చేశారని ఆ పార్టీ నేత బోండా ఉమ అన్నారు. హైదరాబాదును ప్రపంచ పటంలో పెట్టింది చంద్రబాబేనని తెలిపారు. విజన్ 2020లో భాగంగా హైటెక్ సిటీని నిర్మించారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేశారని చెప్పారు.

చంద్రబాబు హయాంలోనే హైదరాబాదులో ఫ్లైఓవర్లు, రింగ్ రోడ్డు వచ్చాయని తెలిపారు. ఏపీలో అమరావతి నిర్మాణాన్ని చేపట్టారని అన్నారు. ఏపీపై చంద్రబాబు శాశ్వత ముద్ర వేశారని చెప్పారు. విజయవాడ దుర్గగుడి ఫ్లైఓవర్ రాష్ట్రానికే మణిహారం కాబోతోందని అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 15 నెలల కాలంలో వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని ఆయన సవాల్ విసిరారు.

Related posts