ఆఫ్ఘనిస్థాన్లోని నంగర్హర్ ప్రావిన్స్లో వరుసగా బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. హస్కా మేయనా జిల్లాలోని జాదారా ఏరియాలోని ఓ మసీదులో వరుసగా రెండు చోట్ల బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. శుక్రవారం ముస్లింలు ప్రార్థనలు చేస్తుండగా దుండగులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. బాంబు పేలుళ్లకు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ఘటన మధ్యాహ్నం 2 గంటల సమయంలో చోటు చేసుకున్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు. బాంబు పేలుళ్లు జరిగిన ప్రాంతంలో బలగాలను భారీగా మోహరించారు.