ప్రముఖ నటి, రంగస్థల కళాకారిణి ఉషా గంగూలీ (75)గుండెపోటుతో మరణించింది. ఈమె మరణం సినీ ఇండస్ట్రీలో విషాదం నింపింది. దక్షిణ కోల్కతాలో నివాసముంటున్న ఆమె గురువారం తన ఫ్లాట్లో ఉషా గంగూలీ విగతజీవిగా పడి ఉండటాన్ని గుర్తించి ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్స్ తెలిపారని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఉషా గంగూలీ మరణవార్త తెలిసి పలువురు బాలీవుడ్ ప్రముఖులు, ఇతర కుటుంబ సభ్యులు తమ సంతాపం తెలియజేశారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఉషా గంగూలీ మరణవార్త తెలిసి తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. ఆమె మరణం నాటక రంగానికి తీరని లోటు అని అన్నారు. జోధ్పూర్లో జన్మించిన ఉషా గంగూలీ.. చిన్నతనంలో భరతనాట్యం నేర్చుకొని హిందీ సాహిత్యం నేర్చుకోవడానికి కోల్కతాకు వచ్చారు. ఆ సమయంలోనే నాటక రంగంలో ప్రవేశించి మహాభోజ్, రుడాలి, కోర్ట్ మార్షల్స్, ఆంతర్యాత్ర లాంటి నాటకాల్లో నటించి టాలెంట్ బయటపెట్టారు.
next post