telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నాలాంటి అనర్హులకు పద్మశ్రీ ఎందుకిస్తారు ?… సీనియర్ నటుడు

Annu

తాజాగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్, నిర్మాతలు ఏక్తా కపూర్, కరణ్ జోహార్‌లను పద్మశ్రీ వరించిన విషయం తెలిసిందే. అయితే బాలీవుడ్‌లో ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సీనియర్ నటుడు అన్ను కపూర్. ఎన్నో ఏళ్లుగా చిత్రపరిశ్రమలో కొనసాగుతున్నప్పటికీ ఆయనకు ఇప్పటివరకు భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి గౌరవం దక్కలేదు. కనీసం ఈసారైనా పద్మ పురస్కారం వస్తుందేమో అనుకున్నారు. కానీ రాలేదు. పైగా పాకిస్థాన్‌లో పుట్టి ఇక్కడ సెటిల్ అయ్యి, ఇక్కడి పౌరసత్వం దక్కించుకున్న సింగర్ అద్నాన్ సమీకి పద్మశ్రీకి పురస్కారం వరించింది. ఇప్పటికే దీనిపై చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ అన్ను కపూర్ గురించి సోషల్ మీడియాలో ప్రస్తావించారు. ఆయనకు పురస్కారం ఎందుకు ఇవ్వలేదు అని ప్రశ్నించారు. ‘సినిమాల్లో సుప్రసిద్ధులు అయిన గొప్ప హాస్యనటుడు, రేడియో హోస్ట్, ఎందరికో రోల్ మోడల్ అయిన అన్నూ కపూర్ పద్మ పురస్కారానికి అర్హులు కారా? దయచేసి అన్ను కపూర్ అభిమానులు ఆయనకు ఓటెయ్యండి’’ అని పోస్ట్ చేశాడు. దీనిపై అన్ను కపూర్ స్పందించారు. ‘‘ధన్యవాదాలు. పద్మ పురస్కారాలు అర్హులకే వస్తాయి. నాలాంటి అనర్హుడికి కాదు. ఏదేమైనా మీలాంటి వారు గుర్తుచేసుకున్నారు. నాకు అదే చాలు’ అని పేర్కొ్న్నారు. సాధారణంగా అన్ను కపూర్ ఇలాంటి వివాదాలకు దూరంగా ఉంటారు. ఈ విషయంపై మాత్రం అసహనం వ్యక్తం చేశారు.

Related posts