బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్, చాకోలెట్ బాయ్ రణ్బీర్ కపూర్ ల ప్రేమాయణం గురించి తెలిసిందే. అయితే ఈ జంట త్వరలోనే పెళ్ళి చేసుకోబోతున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాది నుండి వీరిరివురు రిలేషన్లో ఉండగా… తాజాగా వీరి పెళ్ళికి సంబంధించి మరో కొత్త డేట్ వార్తలలోకి వచ్చింది. బాలీవుడ్ సర్కిల్స్ ప్రకారం అలియా, రణ్బీర్ల నిశ్చితార్దం అక్టోబర్లో జరగనుండగా, వివాహం వచ్చే ఏడాది జరగనుందని అంటున్నారు. అసలు వివాహం ఇదే ఏడాదిలో జరగాల్సి ఉన్నప్పటికి, రణ్బీర్ తండ్రి అనారోగ్యానికి గురవ్వడం, అలియా హెల్త్ కూడా సరిగ్గా లేకపోవడంతో పెళ్ళిని వచ్చే ఏడాదికి వాయిదా వేశారనేది ఈ వార్తల సారాంశం. ఆ మధ్య జరిగిన ఫిలిం ఫేర్ అవార్డు వేడుకలలో రణ్బీర్ కపూర్ సంజూ చిత్రానికి ఉత్తమ నటుడు అవార్డు అందుకోగా, అలియా భట్ రాజీ చిత్రానికి గాను ఉత్తమ నటి అవార్డు గెలుచుకుంది. ఆ సమయంలో అలియా మాట్లాడుతూ “ఇక్కడ నాకు సంబంధించి ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నారు. ఐ లవ్ యూ” రణ్బీర్ పై తన ప్రేమను వెల్లడించింది అలియా. అయితే ఈ పెళ్ళి వార్తల్లో నిజమెంతుందో తెలియాల్సి ఉంది.
previous post
జగన్ అప్పుడే సీఎం అయ్యేవారు: నటి హేమ