telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కరణ్ జోహార్ ఇంట్లో పార్టీ… డ్రగ్స్ మత్తులో సెలెబ్రిటీలు…!?

Bollywood-Celebrities

ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ శనివారం రాత్రి తన ఇంట్లో పలువురు బాలీవుడ్ సెలెబ్రెటీలకు పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో దీపికా పదుకొణే, రణబీర్ కపూర్, అర్జున్ కపూర్, మలైకా అరోరా, విక్కీ కౌశల్, షాహిద్ కపూర్ సహా తదితరులు హాజరయ్యారు. పార్టీకి సంబంధించి రెండు రోజుల క్రితం ఓ వీడియోను కరణ్ జోహార్ తన ట్విట్టర్‌లో షేర్ చేశాడు. అయితే తాజాగా శిరోమణి అకాలీదళ్ ఎమ్మెల్యే మజీందర్ సిర్సా ట్విట్టర్‌లో వారిపై విమర్శలు గుప్పించారు. బాలీవుడ్ నటీనటుల నిజస్వరూపం ఇదేనని.. డ్రగ్స్ మత్తులో తూలుతూ ఎంత గర్వంగా పోజులిచ్చారో చూడండి అంటూ ట్విట్టర్‌లో ఫైర్ అయ్యారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా తన గొంతు వినిపిస్తున్నానని తెలిపారు. అయితే మజీందర్ సిర్సా ఆరోపణలను, విమర్శలను కాంగ్రెస్ నేత మిలింద్ దేవర ఖండించారు. తప్పుడు ఆరోపణలు చేస్తున్నందుకు క్షమాపణలు చెప్పాలన్నారు. ఆ పార్టీలో తన భార్య కూడా ఉందని.. అక్కడ ఎవరూ డ్రగ్స్ సేవించలేదని.. వారి ప్రతిష్టను దెబ్బతీసేలా అసత్యాలు ప్రచారం చేయవద్దని అన్నారు. తప్పుడు ఆరోపణలు చేసినందుకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ విషయం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మన టాలీవుడ్ లోనూ డ్రగ్స్ తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే.

Related posts