కరోనా కలకలం రేపుతున్న సమయంలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్ళడం చర్చనీయాంశంగా మారింది. గ్రీన్జోన్ అయిన హిమాచల్ ప్రదేశ్లోని కులూ మనాలికి కంగన విహార యాత్రకు వెళ్లింది. ప్రతి సంవత్సరం వర్షా కాలం సమయంలో కంగన తన కుటుంబ సభ్యులతో కలిసి మనాలికి వెళుతుందట. ఈ ఏడాది కూడా అలాగే వెళ్లి తన కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేసిందట. ఈ విషయాన్ని ఆమె డిజిటల్ టీమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. `తన కుటుంబం కోసం కంగన ఓ పిక్నిక్ను ఏర్పాటు చేశారు. వాళ్లు గ్రీన్జోన్లోనే ఉన్నప్పటికీ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులూ తీసుకున్నార`ని కంగన డిజిటల్ టీమ్ పేర్కొంది. కంగన తన కుటుంబ సభ్యులతో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియోలను పోస్ట్ చేసింది. ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని భయపెడుతోంది. ఈ వైరస్కు భయపడి చాలా మంది అత్యవసరమైతే తప్ప బయటకు రావడం లేదు.
previous post