విజయనగరం జిల్లాలో ఈరోజు భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బొబ్బిలి పారిశ్రామికవాడలో ఉన్న బాలాజీ కెమికల్స్ లో ఈరోజు మధ్యాహ్నం ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఫ్యాక్టరీలో ఏర్పాటుచేసిన బాయిలర్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ దుర్ఘటనలో బొబ్బిలి మండలానికి చెందిన జగదీశ్, బాడంగి మండలానికి చెందిన సురేష్ తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 10మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేస్తున్నారు.
previous post
పాకిస్థాన్ గడ్డపై 40 వేల మంది టెర్రరిస్టులు ట్రైనింగ్: ప్రధాని ఇమ్రాన్