లాక్డౌన్ సమయంలో వలస కార్మికులను అక్కున చేర్చుకొన్న బాలీవుడ్ నటుడు సోనుసూద్. కరోనావైరస్ విజృంభిస్తున్న సమయంలో సోనుసూద్ ఎంతో మందికి అండగా నిలిచారు. సోనుసూద్ సేవలకు గుర్తుగా ఇటీవలే ఓ అభిమాని ఏకంగా గుడి కట్టేశాడు. అది కూడా తన సొంత ఖర్చుతో సోనూ సూద్కు భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు ఆ అభిమాని. అయితే… తాజాగా ఈ రియల్ హీరోపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముంబైలోని జుహూలోని ఆరు అంతస్తుల భవనాన్ని అనుమతి లేకుండా సోనుసూద్ హోటల్గా మార్చారంటూ బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే.. తనకు బీఎంసీ అనుమతి ఉందని సోనుసూద్ తెలిపాడు. కేవలం మహారాష్ట్ర కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ అనుమతి రావాల్సి ఉందన్నాడు. కరోనా కారణంగా ఆ అనుమతులు రాలేదని… ఒకవేళ అనుమతి రాకుంటే హోటల్ తొలగిస్తానని సోనుసూద్ స్పష్టం చేశారు. కాగా.. బీఎంసీ ఫిర్యాదుపై ప్రాథమిక విచారణ చేస్తామని.. ఆ తర్వాతే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని జుహూ పోలీసులు తెలిపారు.
previous post