ప్రముఖ మొబైల్స్ కంపెనీ బ్లాక్బెర్రీ తన మెసెంజర్ సేవలను మే 31వ తేదీ నుంచి నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఇకపై బ్లాక్బెర్రీ మెసెంజర్ (బీబీఎం) సేవలు యూజర్లకు లభ్యం కావని ఆ కంపెనీ తెలిపింది. చాలా మంది యూజర్లు ప్రస్తుతం పలు భిన్నమైన ఇన్స్టంట్ మెసెంజర్లను వాడుతున్నారని, అందుకే బీబీఎం సేవలను నిలిపివేస్తున్నామని బ్లాక్బెర్రీ తెలిపింది.
. అయితే కొత్తగా బ్లాక్బెర్రీ మెసెంజర్ ఎంటర్ప్రైజ్ (బీబీఎంఈ) పేరిట మరో నూతన మెసేజింగ్ ప్లాట్ఫాంను అందుబాటులోకి తెచ్చామని బ్లాక్బెర్రీ తెలిపింది. దీన్ని వ్యక్తులు, కార్పొరేట్ సంస్థలు వాడుకోవచ్చని తెలిపింది. , మొదటి సంవత్సరం ఈ యాప్ సేవలు ఉచితంగానే లభిస్తాయని, తరువాత 6 నెలల సబ్స్క్రిప్షన్కు రూ.172 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.
రద్దుల ప్రభుత్వంలా వైసీపీ సర్కారు: చంద్రబాబు