telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మరో రాష్ట్రంలో.. ఖాళీ అయిపోయిన బీజేపీ.. సర్వే వెల్లడి…

దేశవ్యాప్తంగా వ్యతిరేకత ఎదుర్కొంటున్న బీజేపీ పార్టీ గత ఎన్నికలలో 29 రాష్ట్రాలకు గాను 19 రాష్ట్రాలను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వ్యతిరేకత ఆయా రాష్ట్రాలలో సుస్పష్టంగా కనిపిస్తుంది. తాజాగా ఒక జాతీయ పత్రిక నిర్వహించిన సర్వేలో బీజేపీ మరో రాష్ట్రంలో కూడా చివరి స్థానానికి చేరుకోవడం, ప్రాంతీయ పార్టీలు అగ్రస్థానంలో ఉండటం జరిగింది అని వెల్లడైంది. ఆ రాష్ట్రంలో గత ఎన్నికలలో బీజేపీ విజయ దుందుభి మోగించింది, కానీ ఈసారి అట్టడుక్కి చేరనుంది. ఇండియా టుడే-కార్వీ నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్’ సర్వే కోసం దాదాపు 2400 నుంచి అభిప్రాయాలు సేకరించారు.

ఆ రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌. అందులో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మిత్రం పక్షం అప్నాదళ్‌తో కలిసి బీజేపీ 18 సీట్లకే పరిమితం అవుతుందని సర్వే తేల్చింది. ఎస్పీ-బీస్పీ-ఆర్ఎల్‌డీల కూటమి 58 సీట్లను గెలుచుకుంటుందని పేర్కొంది. కాంగ్రెస్‌కు నాలుగు సీట్ల వరకు వస్తాయని తెలిపింది. గత ఎన్నికల్లో 71 స్థానాల్లో విజయ దుందుభి మోగించిన బీజేపీ ఈసారి 16 స్థానాలకు పరిమితం అవుతుందని సర్వే నివేదిక వివరించింది.

2014 ఎన్నికలలో ఐదు స్థానాలు మాత్రమే గెలుచుకున్న ఎస్పీ, ఒక్క స్థానంలోనూ విజయం సాధించని బీఎస్పీ ప్రభ ఈసారి వెలిగిపోతుందని, రెండూ కలిపి 58 స్థానాలను కైవసం చేసుకుంటాయని సర్వేలో వెల్లడైంది. గత ఎన్నికల్లో రెండు స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్ ఈసారి మరో రెండు సీట్లను ఎక్కువగా గెలుచుకుంటుందని తేలింది. సర్వేలో వెల్లడైన మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఎస్పీ-బీఎస్పీ కూటమిలో కాంగ్రెస్ కూడా ఉండి ఉంటే బీజేపీ పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని, ఆ పార్టీ ఐదు స్థానాలకే పరిమితమయ్యేదని సర్వే వివరించింది. ఓట్ల శాతం విషయానికి వస్తే ఎస్పీ-బీఎస్పీ-ఆర్ఎల్డీ పక్షానికి 46 శాతం, బీజేపీ-అప్నాదళ్ కూటమికి 36 శాతం, కాంగ్రెస్‌కు 12 శాతం ఓట్లు పడతాయని సర్వే పేర్కొంది.

Related posts