telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆశ్చర్యపోయే ఫలితాలు: బీజేపీ నేత విష్ణుకుమార్

vishnu-kumar-raju-P
బీజేపీ జాతీయ పార్టీ అనీ, ఎంతమంది ఎన్ని పొత్తులతో వచ్చినా తమకు ఏమీ కాదని పీ బీజేపీ శానససభ పక్షనేత విష్ణుకుమార్ రాజు ధీమా వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. బీజేపీ, జనసేనతో చేతులు కలపడం వల్లే ఈరోజు టీడీపీ ఏపీలో అధికారంలో ఉందని స్పష్టం చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆశ్చర్యపోయే  ఫలితాలువస్తాయని జోస్యం చెప్పారు. జనసేనలో ఈరోజు చేరబోతున్న ఆకుల సత్యనారాయణకు శుభాకాంక్షలు తెలిపారు. జేపీ చౌకబారు రాజకీయాలు చేయబోదని స్పష్టం చేశారు.
రాజకీయ జిమ్మిక్కులు చేయడంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని మించినవారు ఎవరూ లేరనీ ఏ విమర్శించారు. తనకు ఉన్న 40 ఏళ్ల అనుభవాన్ని ఎప్పుడు ఎలా వాడాలో ఆయనకు బాగా తెలుసని వ్యాఖ్యానించారు.  రాబోయే ఎన్నికల్లో పవన్ సాయం లేకుంటే గెలవడం కష్టమని గుర్తించిన చంద్రబాబు.. పవన్ ను విమర్శించడం మానేసి ఆ స్థానంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ను తీసుకొచ్చారని అభిప్రాయపడ్డారు. ఏపీలో 20 లక్షల మందితో కాకుంటే కోటి మందితో టీడీపీ సభ పెట్టుకోవచ్చని విష్ణుకుమార్ స్పష్టం చేశారు.

Related posts