ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు జరిగిన ఉపఎన్నికలో బీజేపీ జాతీయ కార్యదర్శి సుధాన్షు త్రివేది ఎన్నికయ్యారు. ఎలాంటి పోటీ లేకుండానే ఆయన ఎన్నికైనట్టు అధికారులు బుధవారంనాడు ప్రకటించారు. కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మృతితో ఈ స్థానానికి ఖాళీ ఏర్పడింది. దీంతో గత శుక్రవారంనాడు త్రివేది నామినేషన్ వేశారు.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి దినేష్ శర్మ, ఇతర పార్టీ నేతలు ఆయన నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు.మెకానికల్ ఇంజనీరింగ్లో పీహెచ్డీ చేసిన త్రివేది చాలాకాలంగా బీజేపీలో పని చేస్తున్నారు. 2014 లోక్సభ ఎన్నికల సందర్భంగా పార్టీ ప్రచార కమిటీ నలుగురు సభ్యుల్లో ఒకరిగా ఆయన ఉన్నారు.
ఆస్పత్రుల్లో పడకలు కరువయ్యాయి: ఉత్తమ్