ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ సూచించారు. రాజధానికి కావాల్సిన అన్ని హంగులు అమరావతికి ఉన్నాయని చెప్పారు. ఇతర ప్రాంతాలను అభివృద్ధి చేసిన తర్వాతే అమరావతిని అభివృద్ధి చేయాలని చెప్పారు.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పైప్రశంసలు కురిపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని కితాబిచ్చారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం పూర్తిగా సహకరిస్తోందని అన్నారు. కేంద్రం నిధులతో ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని కోరారు.