telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

ముస్లింలకు బుద్ధి చెప్పాలంటే.. హిందువులు ముస్లిం మహిళలను రేప్ చేయాలి!: సునీతా సింగ్

sunita singh BJP UP leader

ముస్లింలకు బుద్ధి చెప్పాలంటే హిందువులు ముస్లిం మహిళలను గ్యాంగ్ రేప్ చేయాలని ఉత్తరప్రదేశ్ బీజేపీ మహిళా మోర్చా చీఫ్ సునీతా సింగ్ గౌర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 10 నుంచి 20 మంది ఓ గ్రూపుగా ఏర్పడి ఇంట్లో చొరబడి ముస్లిం మహిళలను గ్యాంగ్ రేప్ చేయాలని పిలుపునిచ్చారు. ముస్లింల తల్లులు, చెల్లెళ్లు, అక్కలను గ్యాంగ్ రేప్ చేయండి. వారి శరీర భాగాలను, జననాంగాలను ఛిద్రం చేసి వీధుల చౌరస్తాల్లో మ‌ృతదేహాలను వేలాడదీయండని వ్యాఖ్యానించారు.

ఎప్పుడైతే ఈ భయంతో ముస్లిం మహిళలు ఇంటి నుంచి బయటకు రారో, అప్పుడే ముస్లింలలో మార్పు వస్తుందన్నారు. ఈ మేరకు ఆమె ఫేస్ బుక్ లో పెట్టిన పోస్ట్ వైరల్ అయింది. చివరికి ఇది బీజేపీ అధిష్టానం దృష్టికి వెళ్లడంతో ఆమెను బాధ్యతల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈ పోస్ట్ వివాదాస్పదం కావడంతో వాటిని సునీతా సింగ్ తొలగించారు. అప్పటికే స్క్రీన్ షాట్లు వైరల్ కావడంతో ఆమె వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

Related posts