telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్ ఎనిమిదో నిజాంలా తయారయ్యారు: రాజాసింగ్

Rajasingh Bjp MLA

తెలంగాణ సీఎం కేసీఆర్ ఎనిమిదో నిజాంలా తయారయ్యారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. తెలంగాణలో కొత్త సచివాలయం నిర్మించే క్రమంలో పాత సచివాలయ భవనాలను కూల్చివేస్తుండడంపై తీవ్రంగా స్పందించారు. కరోనాతో ప్రజలు చనిపోతుంటే పట్టించుకోని ప్రభుత్వానికి కొత్త సచివాలయం ముఖ్యమైందా అంటూ ప్రశ్నించారు.  కొత్త సచివాలయం కోసం పాత నిర్మాణాలు కూల్చివేయడం సరికాదని అన్నారు.

పాత సచివాలయ భవనాలు 50 ఏళ్ల వరకు పనిచేస్తాయని నిపుణులు కూడా చెప్పారని తెలిపారు.నిజాం తన పేరు చిరస్థాయిగా ఉండాలని చార్మినార్ నిర్మిస్తే.. ఇప్పుడు కేసీఆర్ కూడా పేరు కోసం కొత్త సచివాలయం నిర్మిస్తున్నారని ఆరోపించారు. కొత్త సచివాలయం ఓ మసీదులా ఉందని, హజ్ హౌస్ లా కనిపిస్తోందని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. కొత్త సచివాలయ నిర్మాణానికి ప్లాన్ ఎంఐఎం నేతలు ఇచ్చారా అని దుయ్యబట్టారు.

Related posts