telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

బీజేపీ నేత రఘునందన్‌రావుపై కేసు!

Raghunandan

తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్‌రావుపై అత్యాచారం కేసు నమోదైంది. రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని జ్యోతినగర్‌కు చెందిన బాధితురాలు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌ను కలిసి రఘునందన్‌పై ఫిర్యాదు చేసింది. గత 12 ఏళ్లుగా అతడు తనకు నరకం చూపిస్తున్నాడని ఆరోపించింది.

కాఫీలో మత్తుమందు కలిపి అత్యాచారానికి ఒడిగట్టాడని, ఆ సందర్భంగా తీసిన ఫొటోలు, వీడియోలను నెట్‌లో పెడతానని బెదిరిస్తున్నాడని కమిషనర్ ఎదుట వాపోయింది. కమిషనర్ ఆదేశాలతో రామచంద్రాపురం పోలీస్ స్టేషన్‌లో రఘునందన్‌పై అత్యాచారం, బెదిరింపులు, ప్రాణహాని తదితర సెక్షన్ల కింద కేసు నమోదైంది.

Related posts