నేడు ఎల్బీ స్టేడియంలో జరుగనున్న బీజేపీ బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. దీనితో స్టేడియం పరిసరాల్లో సాయంత్రం 4.30 నుంచి 6.45 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నామని నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సభకు హాజరయ్యే వారు కూడా ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాల్లోనే వాహనాలను నిలిపి స్టేడియంలోకి చేరుకోవాలని సూచించారు.
ట్రాఫిక్ ఆంక్షలు :
* ఏఆర్ పెట్రోల్ పంపు జంక్షన్ నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వెళ్లే వాహనాలను నాంపల్లి వైపు మళ్లిస్తారు.
* అబిడ్స్, గన్ఫౌండ్రి నుంచి వచ్చే వాహనాలను ఎస్బీఐ గన్ఫౌండ్రి నుంచి చాపేల్ రోడ్డులో అనుమతిస్తారు.
* బషీర్బాగ్ జంక్షన్ నుంచి జీపీవోకు వచ్చే వాహనాలను బషీర్బాగ్ జంక్షన్ నుంచి హైదర్గూడ, కింగ్కోఠి మీదుగా మళ్లిస్తారు.
* పాత ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి వచ్చే వాహనాలను హిమాయత్నగర్ జంక్షన్ వైపుకు మళ్లిస్తారు.
* రాజమోహల్లా రోడ్డు నుంచి వచ్చే వాహనాలను పాత ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి కింగ్ కోఠి/నారాయాణగూడ వైపునకు పంపిస్తారు.
* కింగ్ కోఠి నుంచి బషీర్బాగ్కు వచ్చే వాహనాలను భారతీయ విద్యాభవన్ వద్ద కింగ్కోఠి క్రాసు రోడ్డు మీదుగా తాజ్మహల్ వైపు అనుమతిస్తారు.
* అంబేద్కర్ విగ్రహం వైపు నుంచి వచ్చే వాహనాలను లిబర్టీ జంక్షన్ నుంచి హిమాయత్నగర్ రోడ్డులో పంపిస్తారు.
* ట్రాఫిక్ కంట్రోల్ రూం నుంచి బషీర్బాగ్కు వచ్చే వాహనాలను నాంపల్లి మార్గంలో పంపిస్తారు.
* హిల్ ఫోర్టు నుంచి వచ్చే వాహనాలను బషీర్బాగ్ వైపు అనుమతించరు. ఆ వాహనాలను పీసీఆర్ జంక్షన్ నుంచి నాంపల్లి రోడ్డులో పంపిస్తారు.
పార్కింగ్ స్థలాల వివరాలు :
– సికింద్రాబాద్ నుంచి వచ్చే వాహనాలు అంబేద్కర్ విగ్రహం, లిబర్టీ, బషీర్బాగ్ మీదుగా ఆయ్కార్ భవన్ వద్దకు చేరుకుని కార్యకర్తలను దించి. వాహనాలను నెక్లెస్ రోడ్డు/ఎన్జీఆర్ స్టేడియంలో పార్క్ చేసుకోవాలి.
– ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, మెహిదీపట్నం, పాత నగరం నుంచి వచ్చే వాహనాలు పబ్లిక్ గార్డెన్లో వాహనాలను నిలుపాలి.
– ముషీరాబాద్, అంబర్పేట్, హిమాయత్నగర్ నుంచి వచ్చే వాహనాలు హైదరాబాద్ పోలీసు కమిషనర్ కార్యాలయం ఎదురుగా ఉన్న నిజాం కాలేజీ గేటులో పార్క్ చేయాలి.
– వీఐపీ వాహనాలను వ్యవసాయ శాఖ కార్యాలయం, ఎస్సీఈఆర్టీ, మహబూబియా కాలేజీలో వాహనాలను పార్క్ చేసుకోవాలి.
– మీడియా ప్రతినిధులు డి-గేటు వద్ద దిగి అలియా కాలేజీ వద్ద వాహనాలను పార్క్ చేసుకోవాలి. ఈ సభను దృష్టిలో పెట్టుకుని వాహనాదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడంతో పాటు ట్రాఫిక్ పోలీసులకు సహకరించి అధికారులు సూచించిన రోడ్డులో ప్రయాణించాలని పోలీసులు సూచిస్తున్నారు.