telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రాజధాని అంశంలో రాయలసీమకే అన్యాయం: ఎంపీ టీజీ వెంకటేశ్

TG Venkatesh MP

రాజధాని అంశంలో రాయలసీమకే అన్యాయం: ఎంపీ టీజీ వెంకటేశ్రాజధాని అంశంలో నాడు, నేడు రాయలసీమకే అన్యాయం జరిగిందని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ అన్నారు. రాయలసీమను రెండో రాజధానిగా చేయాలని పదిహేనేళ్లుగా డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోలేదని విమర్శించారు. గతంలో రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేసినప్పుడు ఎవరూ మాట్లాడవద్దని చంద్రబాబు హుకుం జారీ చేశారని అన్నారు.

రాయలసీమకు రాజధాని హంగులు కావాల్సిందేనని మరోసారి స్పష్టం చేశారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడంతో పాటు అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఇక్కడే నిర్వహించాలని అన్నారు. మినీ సెక్రటేరియట్ నిర్మించాలని డిమాండ్ చేశారు. రాయలసీమను రెండో రాజధానిగా చేయాలని పదిహేనేళ్లుగా డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని అన్నారు.

Related posts