telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ

డ్రగ్స్ కేసులో.. బీజేపీ ఎంపీ కుమారుడు.. !

1000 Crores Ddrugs seized Bomba

మధ్యప్రదేశ్ బీజేపీ ఎంపీ సంపాతియ ఉయే కుమారుడు సత్యేంద్ర ను డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం కలకలం రేపుతోంది. తనకు చెందిన హోండా కారులో 3,380 గ్రాముల 41 హెరాయిన్ ప్యాకెట్లు లభించడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

అప్పుడు సత్యేంద్ర తో పాటు ఉన్న స్నేహితులు షారుక్, అభిషేక్ లపై కూడా కేసు నమోదు చేశారు. అయితే ఒకపక్క ఎన్నికల వేళ ఇలాంటి చర్యలు వెలుగులోకి రావడం సదరు బీజేపీ నేతకు మింగుడు పడకపోవడం సహజం. దీనితో కేసు నుండి తన బిడ్డను ఎలా తప్పించాలో, ఈ మచ్చను దేనితో పూడ్చాలో ఆ నేత తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాడట.

Related posts